కాలువలో పడిపోయిన కారు.. ఏడుగురి మృతి

62చూసినవారు
కాలువలో పడిపోయిన కారు.. ఏడుగురి మృతి
హర్యానాలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దసరా పండుగ సందర్భంగా బాబా రాజ్‌పురి మేళాకు వెళ్తుండగా ముంద్రి గ్రామం వద్ద ఓ కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో ఏడుగురి మృతి చెందారు. కారులో మొత్తం 9 మంది ప్రయాణిస్తుండగా.. డ్రైవర్‌, మరొకరు మాత్రమే ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్