మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

73చూసినవారు
మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
BRS నేత, మాజీ మంత్రి మల్లారెడ్డిపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ లో 32 గుంటల స్థలాన్ని కబ్జా చేశారని శేరి శ్రీనివాస్ రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఆ స్థలంలోని నిర్మాణాలను కూల్చారని శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై 7 సెక్షన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్