కార్పొరేట్ కంపెనీలకు భూములు కావాలంటే భూ యజమానుల దగ్గర నుంచి ఎపిఐఐసి భూములను సేకరిస్తుంది. అయితే ల్యాండ్ టైటిల్ చట్టం అమల్లోకి వస్తే రైతులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే కార్పొరేట్ శక్తులకు భూములు ధారాదత్తం చేయవచ్చు. ఈ చట్టం ప్రకారం దీనినెవరూ కోర్టుకెళ్లి సవాలు చేసి న్యాయం పొందే అవకాశం లేదు. కొత్త చట్టం అమలైతే భూముల నుండి రైతులు, సన్న, చిన్నకారు రైతులు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం ఉంది.