కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు

80చూసినవారు
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై బెంగళూరులోని తిలక్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిర్మలా సీతారామన్‌తో పాటు బీజేపీ నేతలపై జనాధికార సంఘర్ష సంఘటనే (జేఎస్‌పీ)కి చెందిన ఆదర్శ్ అయ్యర్ ఫిర్యాదు చేశారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలతో నిర్మలా సీతారామన్, మరికొంత మందిపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్