తెలుగు సంవత్సరం ప్రారంభమయ్యే ఉగాది పండగ వచ్చేస్తోంది. ఈ పర్వదినాన ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. అయితే మారుతున్న జీవనపరిస్థితుల కారణంగా పండగ పూట ఉచితంగా లభించే మామిడాకులు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తోంది. బిగ్బాస్కెట్లో మామిడాకులు 27 శాతం డిస్కౌంట్తో రూ.69కి వస్తుడంగా, జెప్టో 21శాతం డిస్కౌంట్తో కేవలం రూ. 48కే అందజేస్తోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.