బాంబు పేలి చిన్నారి మృతి

58చూసినవారు
బాంబు పేలి చిన్నారి మృతి
పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని పాండువా ప్రాంతంలో ఇవాళ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. కొంతమంది చిన్నారులు బంతిగా భావించి ఒక బాంబుతో ఆడుతుండగా అది హఠాత్తుగా పేలింది. దీంతో రాజ్ బిస్వాస్(11) అనే బాలుడు మృతి చెందాడు. రూపమ్ వల్లభ్, సౌరభ్ చౌదరి అనే మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరు కుడి చేయి కోల్పోయినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్