ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తాను ప్రత్యక్ష బాధితుడినని మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ తెలిపారు. ‘కృష్ణా జిల్లా విన్నకోటలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే ఆర్డీఓ వెనక్కి పంపించేశారు. 36 ఏళ్ల పాటు ఐఏఎస్గా సేవలందించిన అధికారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల దుస్థితిని ఊహించలేం.’ అని పీవీ రమేష్ ట్విట్ చేశారు.