నాన్వెజ్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త. చికెన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. బర్డ్ ఫ్లూ ప్రభావంతో పలు చోట్ల కేజీ చికెన్ రూ.30కే లభిస్తుంది. ఇటీవల ఏపీలో వందల కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో అధికారులు కోళ్లకు టెస్ట్ చేయించగా బర్డ్ ఫ్లూ సోకినట్లు గుర్తించి పలు ఫౌల్ట్రీ ఫామ్లను కూడా మూసి వేయించారు. ఈ క్రమంలో ఇటీవల ఆకాశాన్ని తాకిన చికెన్ ధరలు ప్రస్తుతం భారీగా పడిపోయాయి.