ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గాదిగూడ మండలం లోకారి వద్ద గుర్తుతెలియని దుండగులు ప్రభుత్వ ఉపాధ్యాయుణ్ని దారుణంగా హత్య చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు గజేందర్ కెనాల్ మేడిగూడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. నేడు స్కూల్ కి వెళ్లే దారిలో గుర్తుతెలియని దుండగులు అతణ్ని అడ్డగించి బండరాళ్లతో తలపై మోది హత్య చేశారు.