ఎన్నికల్లో ప్రధాని మోదీ పోటీ చేసిన వారణాసిలో ఆయన ఓటమి నుంచి తప్పించుకున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కేరళలోని మలప్పురంలో మాట్లాడుతూ.. అయోధ్య ప్రజల చేతిలో బీజేపీ ఓడినట్లే వారణాసిలో మోదీ ఓడిపోయి ఉండేవారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి కావాల్సిన సీట్లు బీజేపీ ఒంటరిగా సాధించకపోవడానికి మోదీ నైతిక బాధ్యత వహించాలని రాహుల్ డిమాండ్ చేశారు.