వందే భారత్ రైలుపై కొందరు ఆకతాయులు రాళ్లు రువ్వారు. దాంతో రైలు కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన పంజాబ్లో జరిగింది. బుధవారం అమృత్సర్-ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై ఫగ్వారా ప్రాంతంలో రాళ్లు రువ్వారు. దీంతో సీ 3 కోచ్లోని 2 విండో గ్లాస్లు పగుళ్లిచ్చాయి. పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న వందే భారత్ రైలు సిబ్బంది ఆ కోచ్ వద్దకు చేరుకుని పరిశీలించారు.