దేశ రాజధాని ఢిల్లీలోని ఇన్కమ్ ట్యాక్స్ (ఐటీ) కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనమైనట్లు సమాచారం. కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో తీవ్ర భయాందోళనకు గురైన ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.