ఆత్మలతో మాట్లాడుతుందని భార్యను నరికి చంపిన భర్త

85చూసినవారు
ఆత్మలతో మాట్లాడుతుందని భార్యను నరికి చంపిన భర్త
రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. తరుచుగా ఫోన్ ద్వారా ‘ఆత్మ’లతో మాట్లాడుతోందని భార్యను కిరాతకంగా హతమార్చడు ఓ వ్యక్తి. ఈ ఘటన బార్మర్ జిల్లాలో జరిగింది. చున్నీలాల్, జియోదేవీ ఇద్దరు భార్యభర్తలు. తన భార్య ఆత్మలతో ఫోన్ ద్వారా మాట్లాడుతోందని అనుమానించిన చున్నీలాల్.. ఆమెను బుధవారం తెల్లవారుజామున గొడ్డలితో నరికి చంపాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చున్నీలాల్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్