మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ రాజ్యసభ ఉప ఎన్నికలకు ఎన్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎగువ సభలో మొత్తం పది ఖాళీలు ఉన్నాయి. అందులో అస్సాం, బీహార్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో రెండు చొప్పున, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల్లో ఒక్కొక స్థానం ఖాళీగా ఉన్నట్లు రాజ్యసభ సెక్రటేరియట్ నోటిఫై చేసింది. దీంతో ఖాళీ అయిన స్థానాలకు జూన్ 25న ఎన్నికలు నిర్వహించనుంది.