నడి రోడ్డుపై కత్తితో పొడిచి వ్యక్తి దారుణ హత్య .. వీడియో వైరల్

57చూసినవారు
గుజరాత్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని అతి కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన బనస్కాంతలో జరిగింది. ఓ గల్లీ నుంచి స్క్రాప్ బండి తీసుకువెళ్తున్న వ్యక్తి పై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే అతడిపై దుండగుడు ఆయుధంతో పలుమార్లు దాడి చేయడంతో కప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. పూర్తి వివరాలు తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్