దేవాలయంలో నిద్రించడానికి వెళ్లిన వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన హైదరాబాద్లోని పహాడీషరీఫ్ పరిధిలో చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన నవనాథ్(40) గతకొంత కాలంగా జల్పల్లిలోని పోచమ్మ ఆలయ ప్రాంగణంలో పడుకుంటున్నాడు. ఈనెల 8న రాత్రి మహారాష్ట్రకు చెందిన కాంసింగ్(40) పోచమ్మ ఆలయం వద్దకు నిద్రించేందుకు వెళ్లగా.. అక్కడ పడుకుని ఉన్న నవనాథ్తో వివాదం తలెత్తింది. ఈక్రమంలో నవనాథ్ కర్రతో కాంసింగ్ తలపై దాడి చేయటంతో మృతిచెందాడు.