ఎన్నికల్లో కుమారుడు అనిల్ ఆంటోనీ
బీజేపీ తరఫున పోటీ చేయడంపై
కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు ఓడిపోవాలని కోరుకున్న ఆంటోనీ..
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందాలని ఆశించారు.
కాంగ్రెస్ నేతల పిల్లలు బీజేపీలో చేరడాన్ని ఆయన తప్పుపట్టారు.
ఇండియా కూటమి పురోగతి సాధిస్తోందని.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కాగా సౌత్ కేరళ నియోజకవర్గంలో అనిల్ ఆంటోనీ బరిలో నిలిచారు.