ఉత్తరప్రదేశ్లో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ వేపై వెళుతున్న కారులో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే కారు మొత్తం తగలబడిపోయింది. ఇది గమనించిన స్థానికులు కారులో ఉన్న వ్యక్తులను బయటకు తీయడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికక్కడే మంటలను అదుపులోకి తెచ్చారు. ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ వేపై ఛిజార్సీ ఇందిరాపురం మధ్య ఈ ఘటన జరిగింది.