ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. అక్కడ బాద్షా నగర్ మెట్రో స్టేషన్లోని ఓ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.