ప్రమాదకరమైన కొత్తరకం డ్రగ్స్ను లాలాగూడలో పోలీసులు పట్టుకున్నారు. అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ అక్రమ రవాణా, వినియోగం జరిగే ఓజీ ఖుష్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి బెంగళూరు మీదుగా ఈ మాదకద్రవ్యాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చి ఓ గ్యాంగ్ విక్రయిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఓజీ ఖుష్ ఒక్క గ్రాము విలువ మన కరెన్సీలో రూ.4వేలు ఉంటుందని టాస్క్ఫోర్స్ పోలీసులు చెబుతున్నారు.