రాహుల్‌ ప్రసంగంపై దుమారం

75చూసినవారు
రాహుల్‌ ప్రసంగంపై దుమారం
లోక్‌సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌‌గాంధీ చేసిన ప్రసంగంలోని కొన్ని అంశాలను పార్లమెంట్‌ రికార్డుల నుంచి తొలగించారు. ప్రతిపక్షం తరఫున రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను ప్రారంభించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిందూమతాన్ని ఉద్దేశించి రాహుల్‌ చేసిన వ్యాఖ్యలతో పాటు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, అగ్నివీర్‌, మోదీ, నీట్‌ పరీక్షల్లో అక్రమాలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను తొలగిస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్‌ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్