ఎలాన్ మస్క్కు చెందిన మైక్రోబ్లాగింగ్ సైట్ 'ఎక్స్'లో కొత్త మార్పును తీసుకురానున్నట్లు ప్రకటించింది. తన ప్రీమియం సబ్స్క్రైబర్లను పెంచుకొనేందుకు ఇకపై లైవ్ స్ట్రీమ్ను ప్రారంభించాలంటే కచ్చితంగా ప్రీమయం సబ్స్క్రిప్షన్ ఉండాలని పేర్కొంది. ఈ విషయాన్ని లైవ్ ప్రొఫెల్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. అయితే ఎప్పటి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయనే విషయం తెలియదు.