తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ కోళ్ల ఫాంకు విద్యుత్ అంతరాయం ఏర్పడి వెయ్యి కోళ్లు మృతి చెందాయి. సద్ది రాజిరెడ్డి అనే వ్యక్తికి చెందిన పౌల్ట్రీ ఫామ్లో శుక్రవారం విద్యుత్ ఏకదాటిగా 4 గంటలు స్తంభించడంతో అందులో ఉన్న కోళ్లు వేడికి తట్టుకోలేక వెయ్యికి పైగా చనిపోయి సూమారు రూ.300000 నష్టం జరిగింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుకున్నారు.