చిన్నారుల మరణం కలచివేసింది: రాహుల్‌ గాంధీ

58చూసినవారు
చిన్నారుల మరణం కలచివేసింది: రాహుల్‌ గాంధీ
గుజరాత్‌ లోని గేమింగ్‌ జోన్‌ లో, అదేవిధంగా ఢిల్లీలోని ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముక్కుపచ్చలారని చిన్నారులు చనిపోవడం తనను కలచివేసిందంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆదివారం ఉదయం ఆయన ట్వీట్‌ చేశారు. మఅతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలంటూ రాహుల్‌ ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్