కావ్య మారన్.. క్రికెట్ ప్రేమికులకు, ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కి పరిచయం అక్కర్లేదు. ఐపీఎల్లో హైదరాబాద్ మ్యాచ్లకు హాజరై ఫ్యాన్స్లో ఉత్సాహన్ని నింపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. ఎస్ఆర్హెచ్ సీఈఓగా వ్యవహరిస్తున్న కావ్య మారన్కు రూ.4 వేల కోట్లకుపైగా ఆస్తున్నాయి. భారత్లో అత్యంత సంపద కలిగిన యువ పారిశ్రామికవేత్తల్లో ఈమె ఒకరు. ఇక కావ్య మారన్కు ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో ఖాతాలు లేవు.