ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలికి చెందిన సునీల్ కుమార్ అనే రైతు ఆన్లైన్లో బర్రెను ఆర్డర్ పెట్టాడు. యూట్యూబ్లో ఓ వీడియో చూసిన సునీల్ ఆ బర్రెను కొనుగోలు చేయాలనుకున్నాడు. వీడియో డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్కు కాల్ చేశాడు. జైపూర్కు చెందిన శుభమ్ అనే వ్యక్తి ఆ బర్రె ధర రూ.55 వేలు చెప్పాడు. దాంతో సునీల్ అడ్వాన్స్గా రూ.35 వేలు చెల్లించాడు. డెలివరీ చేస్తానని చెప్పిన శుభమ్ ఆ తర్వాత కాల్ లిఫ్ట్ చేయలేదు. దాంతో సునీల్ పోలీసులను ఆశ్రయించాడు.