లఖ్పతి దీదీ పథకం లక్ష్యాన్ని 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచాలని నిర్ణయించినట్లు మధ్యంతర బడ్జెట్-2024లో కేంద్రం ప్రకటించింది. గ్రామాల్లోని 2 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడమే 'లఖ్పతి దీదీ' ప్రధాన ఉద్దేశం. ఈ పథకం కింద మహిళలకు ఎల్ఈడీ బల్బుల తయారీ, డ్రోన్లను ఆపరేట్ చేయడం వంటి నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి.. వారు ఏటా రూ.లక్షకు పైగా ఆదాయాన్ని పొందేలా తోడ్పాటు అందిస్తారు.