తార్నాకలో రైలు ఢీకొని మహిళ మృతి

63చూసినవారు
తార్నాకలో రైలు ఢీకొని మహిళ మృతి
రైలు పట్టాలు దాటుతుండగా ఓ మహిళను రైలు ఢీకొనడంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే PS పరిధి లాలాపేట్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. లాలాపేటలోని కీర్తి టవర్స్ లో నివాసం ఉండే మహిళ ఎలిజబెత్ లాలాపేట్ నుంచి తార్నాక వస్తుండగా రైలు పట్టాలు దాటడానికి యత్నించింది. ఈ సమయంలో వచ్చిన ట్రైన్ ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్