దేశవ్యాప్తంగా ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. ఇక తాజాగా ఫేక్ పార్సిల్ స్కామ్లో 33 ఏండ్ల మహిళ ఏకంగా రూ.7.9 లక్షలు నష్టపోయారు. కర్ణాటకలోని ఉడుపికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జూన్ 22న నమ్రతను స్కామర్లు ఫెడ్ఎక్స్, ముంబై పోలీస్ అధికారులుగా నమ్మబలుకుతూ మోసగించారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.