ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ (వీడియో)

74చూసినవారు
అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన మొదటి అధికారిక పర్యటనలో భాగంగా భారత్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ న్యూ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చలు జరపనున్నారు. ఆయనతో పాటు యూఏఈ ప్రభుత్వం నుంచి పలువురు మంత్రులు, వ్యాపార ప్రతినిధులు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్