శివ బాలకృష్ణ కేసులో బినామీలకు ఏసీబీ నోటీసులు

69చూసినవారు
శివ బాలకృష్ణ కేసులో బినామీలకు ఏసీబీ నోటీసులు
తెలంగాణలో సంచలనంగా మారిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా శివ బాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. బినామీలుగా ఉన్న భరత్, సత్యనారాయణ, భరణికి నోటీసులు అందాయి. ఈ ముగ్గురిని మంగళవారం ఏసీబీ విచారించబోతోంది. కాగా యాదాద్రి జిల్లాలో 57 ఎకరాల భూమిని శివ బాలకృష్ణ తన బినామీల పేరుతో కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్