దేశంలో అత్యంత విలువైన 500 ప్రైవేటు కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) అగ్రస్థానంలో నిలిచింది. 2023 అక్టోబరు నాటికి ఆయా సంస్థల మార్కెట్ విలువ ఆధారంగా యాక్సిస్ బ్యాంక్కు వెల్త్ మేనేజ్మెంట్ విభాగమైన బర్గండీ ప్రైవేట్, హురూన్ ఇండియా సంయుక్తంగా ఈ నివేదిక రూపొందించాయి. ఈ నివేదిక రూపొందించిన సమయంలో RIL మార్కెట్ విలువ రూ.15.6 లక్షల కోట్లు (ప్రస్తుత విలువ రూ.19.65 లక్షల కోట్లు).