రైస్‌ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి: ఏలేటి

58చూసినవారు
రైస్‌ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి: ఏలేటి
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారిని సీఎంగా చేసిన ఘనత బీజేపీదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 'నేను సీఎం రేవంత్‌ రెడ్డిలాగా అపాయింట్‌మెంట్‌ కాలేదు. రేవంత్‌రెడ్డి పీసీసీ పదవి కొన్నారని గతంలో కాంగ్రెస్‌ నేతనే చెప్పారు. కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకే సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చాం. రూ.వందల కోట్లు బకాయిలు ఉన్న రైస్‌ మిల్లర్లందరిపై చర్యలు తీసుకోవాలి. డిఫాల్ట్‌ ఉన్న రైస్‌ మిల్లర్ల పేర్లు మీరు బయటపెట్టగలరా?' అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్