ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తాం: పొన్నం

52చూసినవారు
ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తాం: పొన్నం
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా హనుమకొండలో జరిగిన ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో పొన్నం మాట్లాడారు. ఎన్నికల హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. అలాగే ఈ ఏడాది కాకతీయ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్