కన్నడ నటి రన్యారావు జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఈనెల 21 వరకు పొడిగించింది. రన్యారావు దుబాయ్ నుంచి బెంగళూరుకు దాదాపు 15 కిలోల బంగరాన్ని అక్రమంగా రవాణా చేస్తూ బెంగళూరు ఎయిర్పోర్టులో పట్టుబడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న ఆమెను మరో సారి విచారణకు అవకాశం కల్పించాలని పోలీసులు కోర్టును కోరగా కోర్టు కస్టడీని పొడిగించింది.