ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్
అదానీ దేశంలో నెం.1 సంపన్నుడిగా నిలిచాడని బ్లూమ్బిర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ఈ మేరకు అదానీకి అనుకూలంగా సుప్రీంలో తీర్పు రావడంతో ఆయన కంపెనీల షేర్లు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ఇవాళ ఉ.9.30 గంటలకు
అదానీ సంపద 97.6 బిలియన్ డాలర్లకు చేరడంతో ఈ ఘనత సాధించారు. ఈ క్రమంలోనే ముకేశ్
అంబానీ ఆదాయం 97 బిలియన్ డాలర్ల వద్ద ఉండటంతో స్వల్పంగా వెనుకబడి ఉన్నారు.