ఎంబీబీఎస్ లో ప్రవేశాలకు ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మూడు కేంద్రాలు ఏర్పాటు చేయగా 1785మంది పరీక్ష రాశారు. 48 మంది హాజరు కాలేదు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ఉన్నప్పటికీ ఉదయం 11గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతించారు. బయోమెట్రిక్ తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తకుండా వచ్చిన వారిని వచ్చినట్లు లోనికి పంపించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కేంద్రాలు తెలియక అవస్థలు పడ్డారు.