మహారాష్ట్రలో ఎన్నికల సందర్భంగా ఎస్పీ గౌష్ ఆలం అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది విధులను పరిశీలించారు. జైనథ్ మండలం పిప్పర్వాడ, అనంతపూర్ చెక్ పోస్ట్ లను చేరుకొని అక్కడ నుండి ఆదిలాబాద్ కు వస్తున్న వాహనాలను, ఇక్కడి నుండి మహారాష్ట్రకు వెళ్లే వాహనాలను తనిఖీ చేశారు. మహారాష్ట్రలో సరిహద్దు దిగ్రస్ చెక్పోస్ట్ ను కూడా పరిశీలించారు. వాహనాల రాకపోకలను గమనించి సిబ్బందికి సూచనలు చేశారు.