ముగిసిన మొదటి విడత ఎంబిబిఎస్ ప్రవేశాలు

74చూసినవారు
ఆదిలాబాద్ లోని రిమ్స్ మెడికల్ కాలేజీలో రాష్ట్ర కోటా మొదటి విడత ఎంబీబీఎస్ ప్రవేశాలు గురువారంతో ముగిశాయి. రాష్ట్ర కోట మొదటి విడత 75 సీట్ల కేటాయించగా అన్ని భర్తీ అయ్యాయి. మొదటిరోజు 24 మంది, రెండో రోజు 27 మంది ప్రవేశాలు పొందగా. చివరి రోజు గురువారం 24 మంది ప్రవేశాలు పొందినట్లు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు రిమ్స్ డైరెక్టర్ అభినందనలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్