రోగిని ఇబ్బందులకు గురి చేసిన వైద్య సిబ్బంది

1065చూసినవారు
రోగిని ఇబ్బందులకు గురి చేసిన వైద్య సిబ్బంది
బేల మండలం ఏటి గ్రామానికి చెందిన నత్తు గత కొంతకాలంగా నడుము నొప్పితో బాధపడుతున్నాడు. ఈ విషయమై ఆయన శనివారం రిమ్స్ ఆసుపత్రికి రాగా వైద్య సిబ్బంది అతనిని చేర్చుకునేందుకు ఇబ్బందులకు గురి చేశారు. రోగి బంధువులు ఈ విషయాన్ని స్థానిక నాయకుడు రూపేష్ రెడ్డికి తెలియజేశారు. ఆయన రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తో మాట్లాడి చివరకు రోగిని ఆసుపత్రిలో చేర్చుకున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రూపేష్ రెడ్డి కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్