ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

1537చూసినవారు
ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని ముండే శేషరావు కుమారుడైన బాలాజీ(28) చిన్నతనం నుండి మతిస్థిమితం సరిగా లేదు. మంగళవారం వ్యవసాయ చేనుకు వెళ్ళి రాత్రి అయినా తిరిగి రాకపోయేసరికి చుట్టుపక్కల గ్రామాలు వెతికినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. శేషరావు తమ్ముడు బాలాజీని వెతుక్కుంటూ వ్యవసాయ పొలాలలో తిరుగుతుండగా పొలంలోని బావిలో పడి చనిపోయి కనిపించాడు. ఎస్సై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్