పుట్ పాత్ ను ఢీకొట్టి యువకుడు మృతి

70చూసినవారు
పుట్ పాత్ ను ఢీకొట్టి యువకుడు మృతి
బెల్లంపల్లి పట్టణంలోని కాలెక్స్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మండలంలోని ఆకెనపల్లి గ్రామానికి చెందిన తోకల ప్రదీప్ (21) ద్విచక్రవాహనంపై వస్తు ఉండగా కాలెక్స్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై అదుపు తప్పి ఫుట్పాత్ను ఢీకొట్టాడు. దీంతో కిందపడిపోగా తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్