విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. ఒకరికి తీవ్ర గాయాలు

26218చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లఖంపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మహేష్ అనే వ్యక్తి ఇచ్చోడ నుంచి మెట్ పల్లి కి కారులో వెళ్తున్న క్రమంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పోల్స్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం నిర్మల్ ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్