భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారాముల అభిషేకం

1076చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో గల శ్రీ రామాలయంలో శ్రీ సీతా రాముల అభిషేకాన్ని శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు విశాల్ శర్మ సమక్షంలో ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించారు. భక్తులంతా రామ నామం పటిస్తూ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో మహ అన్న దాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్