మహిళల హక్కులపై అవగాహన కార్యక్రమం

56చూసినవారు
మహిళల హక్కులపై అవగాహన కార్యక్రమం
మహిళా సాధికారత కేంద్రం, సఖీ కేంద్రం అధ్వర్యంలో గుడిహత్నూర్ మండలంలోని ఉమ్రీ (బీ) గ్రామంలో ఉపాధి హామీ పని చేస్తున్న కూలీలకు, ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళ చట్టాలు, పని చేసే చోట లైంగిక వేదింపులు, సైబర్ క్రైమ్, మహిళల హక్కులు, ప్రభుత్వ పథకాలపై మిషన్ కోఆర్డినేటర్ యశోద అవగాహన కల్పించారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు సేఫ్ టచ్ అన్ సేఫ్ టచ్ గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్