వడదెబ్బతో కూలి మృతి

5594చూసినవారు
వడదెబ్బతో కూలి మృతి
వడదెబ్బతో రోజువారి కూలి మృతి చెందిన సంఘటన దస్తురాబాద్ మండల కేంద్రంలో జరిగింది. ఆ మండల కేంద్రానికి చెందిన రామగిరి లక్ష్మీనరసయ్య రోజు వారి కూలిగా పనిచేస్తున్నారు. రెండు రోజులుగా నీరసంగా ఉండి శుక్రవారం కూడా ఆయన పనికి వెళ్లారు. అయితే పని స్థలంలో లక్ష్మీ నరసయ్య కుప్ప కూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను స్థానిక ఆర్ఎంపీ డాక్టర్కు చూపించి ఖానాపూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్