భూదాన భూమిలో క్రీడా మైదానం లేదా పార్కు ఏర్పాటు చేయాలి

77చూసినవారు
భూదాన భూమిలో క్రీడా మైదానం లేదా పార్కు ఏర్పాటు చేయాలి
మంచిర్యాలలోని గర్మిల్ల శివారు సర్వే నెంబర్ 707, 708లో ఉన్న భూదాన యజ్ఞ బోర్డు భూమిలో జైలు నిర్మాణం కాకుండా యువత కోసం క్రీడా మైదానం, లేదా పార్కు ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద పౌర సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు తుల మధుసూదన్ రావు మాట్లాడుతూ దశాబ్దాల పోరాటంతో భూదాన యజ్ఞ బోర్డు భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్