మంచిర్యాల దుర్గామాత శోభాయాత్రలో అపశృతి

75చూసినవారు
మంచిర్యాల దుర్గామాత శోభాయాత్రలో అపశృతి
సీసీసీ నస్పూర్ ఫ్లడ్ కాలనీకి చెందిన గోమాస నందు (16) మంచిర్యాలలోని రెడ్డి కాలనీలో నిర్వహించిన శోభాయాత్రలో తన అక్కతో కలిసి వచ్చాడు. టాటా ఏస్ వాహనంలో ఉన్న జనరేటర్ ను స్టార్ట్ చేసేందుకు రాకేష్ తో కలిసి నందు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో మరో యువకుడు సాకేత్ అజాగ్రత్తగా అతివేగంగా బొలెరో వాహనం నడుపుతూ వారిని ఢీకొట్టాడు. దీంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు ఎస్సై సనత్ రెడ్డి సోమవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్