విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలి

51చూసినవారు
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలి
జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ కాలనీలో ఉన్న మంచిర్యాల క్లబ్ లో శనివారం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జోనల్ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలను జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని సూచించారు. క్రీడలలో పాల్గొనడం వల్ల ఉత్సాహంగా ఉంటారని, క్రీడలలో గెలుపోటములను క్రీడాస్ఫూర్తితో స్వీకరించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్