దిలావర్పూర్ మండల కేంద్రంలో అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సుమాంజలి ఆదివారం తెలిపారు. గ్రామానికి చెందిన బెజ్జారం నరేష్ అనే వ్యక్తి బతుకు తెరువు కోసం డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. మూడు లక్షల అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక ఆదివారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై వెల్లడించాడు